Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మన సినిమాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం చిరంజీవి వినతి
న్యూఢిల్లీ: వియత్నాంలో ఉన్న సుందర ప్రదేశాల్లో సినిమా షూటింగ్లు జరిపేందుకు భారత చిత్ర పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని చిరంజీవి వియత్నాంకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి భారత వ్యాపారుల బృందంతో వియత్నాంలో పర్యటిస్తున్నారు. వియత్నాంలో పెట్టుబడులకు గల అవకాశాలు పరిశీలించేందుకు ఈ బృందం అక్కడికి వెళ్లింది. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర పరిశ్రమ తన వంతు మేలు చేసేందుకు ప్రయత్నించారు.
చిరంజీవి స్వతహాగా నటుడు కావడం, చిత్ర పరిశ్రమ విదేశాల్లో షూటింగులు జరుపుకునే టప్పుడు ఎదుర్కొనే సమస్యలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో...... చిరంజీవి ఈ విజ్ఞప్తి చేసినట్లు స్పష్టం అవుతోంది. టూరిజం మంత్రిగా ఉన్నప్పటికీ చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై సినీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
ఇతర వివరాల్లోకి వెళితే.... చిరంజీవి అక్కడ జరిగిన భారతీయ ఎంబసీ, వియత్నాం పారిశ్రామిక, వాణిజ్య శాఖ, వియత్నాం చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, దనంగ్ పీపుల్స్ కమిటీలు గురువారం హనోయ్లో నిర్వహించిన వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.
'ఆసియాన్'లో 2015 నాటికి వంద బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్నదే తమ లక్ష్యమని తెలిపారుజనవరి 18-21వ తేదీల మధ్య గౌహతిలో జరిగే అంతర్జాతీయ టూరిజం మార్ట్కు హాజరు కావాలని వియత్నాం బృందాన్ని చిరంజీవి ఆహ్వానించారు.