Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పూరి కొడుకు సినిమా..చార్మీకి భారం తగ్గిపోయిందట..నేహా శెట్టి అందాలు!
Recommended Video
పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మెహబూబా. 1971 ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ మద్యన విడుదలైన మెహబూబా టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇండియా పాక్ బోర్డర్ లో జరుగుతున్న యుద్ధ సన్నివేశాలని పూరి అబ్బురపరిచేలా చూపించారు. కాగా ఈ చిత్ర షూటింగ్ పూరైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు.
కొడుకుతో తొలిసారి
తనయుడు ఆకాష్ పూరితో పూరిజగన్నాథ్ చేస్తున్న తొలి చిత్రం మెహబూబా. దీనితో పూరిజగన్నాథ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
పూరి మనసుపెట్టి చేస్తే
పూరి జగన్నాథ్ కు దర్శకుడుగా మంచి ప్రతిభ ఉంది. కానీ కథలపై సరిగా దృష్టి పెట్టడనే విమర్శలు ఉన్నాయి. మెహబూబా చిత్రానికి పూరి జగన్నాథ్ పూర్తిగా తన శక్తి సామర్థ్యాలని వినియోగించి చేసినట్లు టీజర్ ద్వారా స్పష్టంగా అర్థం అయింది.
గుమ్మడికాయ కొట్టేశారు
మెహబాబా చిత్ర యూనిట్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనితో చార్మి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం విశేషం.
భారం మొత్తం తగ్గిపోయిందట
మెహబూబా చిత్ర షూటింగ్ పూర్తికావడంతో భారం మొత్తం తగ్గిపోయి లైట్ అయిపోయామని చార్మి ట్విట్టర్ లో పేర్కొంది. చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపింది.
అందాల నేహా శెట్టి
ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన అందాల నేహా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో మేహా శర్మ ఘాటు అందాలు యువతని ఆకర్షిస్తున్నాయి.
ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో
మెహబూబా చిత్రం 1971 ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో రూపొందించారు. వార్ సన్నివేవాలు ఉంటూనే మెహబాబా చిత్రాన్ని పూరి ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు తెలుస్తోంది.