Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకీ, నాగ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ టీమ్స్ వేలం ద్వారా...
హైదరాబాద్ : టాలీవుడ్ సినీ పరిశ్రమ కలిసి కట్టుగా ఈ నెల 30న ‘మేము సైతం' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హుధూద్ తుఫాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో క్రికెట్ మ్యాచ్తో పాటు వివిధ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
క్రికెట్ మ్యాచ్ విషయానికొస్తే..... స్టార్స్ అంతా మొత్తం నాలుగు జట్లుగా ఏర్పడనున్నారు. ఈ జట్లకు వెంకటేష్, నాగార్జున, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బిడ్డింగ్ ప్రాసెస్లో వేలం ద్వారా ఆయా జట్లకు ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. జట్లలో హీరోలతో పాటు, హీరోయిన్లు కూడా ఉండనున్నారు. ఈ నెల 27న జట్ల ఎంపక జరుగుతుంది.
బిడ్డింగ్ ప్రాసెస్ లో జట్ల ఎంపిక కార్యక్రమం ఈ నెల 27న రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో కెప్టెన్లు తమ జట్టు సభ్యులను ఎంచుకుంటారు. క్రికెట్ మ్యాచ్ ఆడే స్టార్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
హీరోలు : రవితేజ, అల్లరి నరేష్, నారా రోహిత్, మంచు మనోజ్, గోపీచంద్, కల్యాణ్ రామ్, నాని, నితిన్, నాగ శౌర్య, నిఖిల్, మంచు విష్ణు, తరుణ్, రాజశేఖర్, ఆది, సందీప్ కిషన్, సచిన్ జోషి, సుశాంత్, వరుణ్ సందేశ్, అఖిల్, సాయి ధరమ్ తేజ్, , తారకరత్న, శ్రీకాంత్, ఆదర్శ్, ఖయ్యుం, ప్రిన్స్, సుమంత్, అజయ్, సుధీర్ బాబు తదితరులు.
హీరోయిన్లు : అనుష్క, సమంత, కాజల్, హన్సిక, ప్రణీత, రాకుల్ ప్రీత్ సింగ్, చార్మి, ప్రియమణి, అర్చన, స్వాతి, రాశి ఖన్నా తదితరులు.