twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ, నాగ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ టీమ్స్ వేలం ద్వారా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్ సినీ పరిశ్రమ కలిసి కట్టుగా ఈ నెల 30న ‘మేము సైతం' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హుధూద్ తుఫాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో క్రికెట్ మ్యాచ్‌తో పాటు వివిధ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    క్రికెట్ మ్యాచ్ విషయానికొస్తే..... స్టార్స్ అంతా మొత్తం నాలుగు జట్లుగా ఏర్పడనున్నారు. ఈ జట్లకు వెంకటేష్, నాగార్జున, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బిడ్డింగ్ ప్రాసెస్‌లో వేలం ద్వారా ఆయా జట్లకు ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. జట్లలో హీరోలతో పాటు, హీరోయిన్లు కూడా ఉండనున్నారు. ఈ నెల 27న జట్ల ఎంపక జరుగుతుంది.

    హైదరాబాద్

    బిడ్డింగ్ ప్రాసెస్ లో జట్ల ఎంపిక కార్యక్రమం ఈ నెల 27న రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ బిడ్డింగ్ ప్రాసెస్‌లో కెప్టెన్లు తమ జట్టు సభ్యులను ఎంచుకుంటారు. క్రికెట్ మ్యాచ్ ఆడే స్టార్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    హీరోలు : రవితేజ, అల్లరి నరేష్, నారా రోహిత్, మంచు మనోజ్, గోపీచంద్, కల్యాణ్ రామ్, నాని, నితిన్, నాగ శౌర్య, నిఖిల్, మంచు విష్ణు, తరుణ్, రాజశేఖర్, ఆది, సందీప్ కిషన్, సచిన్ జోషి, సుశాంత్, వరుణ్ సందేశ్, అఖిల్, సాయి ధరమ్ తేజ్, , తారకరత్న, శ్రీకాంత్, ఆదర్శ్, ఖయ్యుం, ప్రిన్స్, సుమంత్, అజయ్, సుధీర్ బాబు తదితరులు.

    హీరోయిన్లు : అనుష్క, సమంత, కాజల్, హన్సిక, ప్రణీత, రాకుల్ ప్రీత్ సింగ్, చార్మి, ప్రియమణి, అర్చన, స్వాతి, రాశి ఖన్నా తదితరులు.

    English summary
    Venkatesh, Nagarjuna, NTR and Ram Charan were elected as the captains for the star cricket match which is to be played on 30th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X