సమాజానికి ఉపయోగపడే చిత్రం మేరా భారత్ మహాన్.. అఖిల్ కార్తీక్
Recommended Video

ప్రత ప్రొడక్షన్స్ బ్యానర్పై భరత్' డైరెక్టర్ గా నిర్మాతలు డాక్టర్ శ్రీధర్ రాజు, డాక్టర్ తాళ్ల రవి, డాక్టర్ టిపిఆర్ కలిసి నిర్మిస్తున్న చిత్రం మేరా భారత్ మహాన్. ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్ ఉప శీర్షిక. ఈ సినిమా నవంబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దర్శకుడు సాగర్, దర్శకుడు బీ గోపాల్, గీత రచయిత చంద్రబోస్, తదితరులు హాజరయ్యారు.
హీరో అఖిల్ కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. దర్శకులు భరత్ నాకు మొదట కథ చెప్పగానే చాలా నచ్చింది. ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఉన్నారు. ఎదో కమర్షియల్ సినిమా కాకుండా మంచి మెసేజ్ వున్నా సినిమా నిర్మించడం ఆనందంగా వుంది అని అన్నారు,
హీరొయిన్ ప్రియశర్మ మాట్లాడుతూ నాకు ఈ చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు భరత్కు నా కృతజ్ఞతలు. ఈ సినిమా చాలా గొప్పగా వుంటుంది. ప్రస్తుత సమాజంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలుసు. ఈ చిత్రాన్ని చూసి సమాజంలోని కొంతమందైనా మారే అవకాశం వుంటుంది అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నటీనటులు: అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, తనికెళ్ళ భరణి, పోసాని, సాయిచంద్, ఎల్ బి.శ్రీరామ్, సన, ప్రగతి, జయప్రకాశ్ రెడ్డి, సురేఖవాణి, ఝాన్సీ తదితరలు,
సాంకేతిక వర్గం: కథ డా శ్రీధర్ రాజు, మాటలు.ఎర్రంశెట్టి సాయి, సంగీతం: లలిత సురేష్, కెమెరా: ముజీర్ మాలిక్, ఎడిటర్ మేనగ శ్రీను.


Click it and Unblock the Notifications











