Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చరణ్ ‘మెరుపు’ ఆగిపోలేదట...మళ్ళీ వస్తుందట...!
పవన్ కళ్యాణ్ 'బంగారం" దర్శకుడు ధరణి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా అట్టహాసంగా ఆరంభమైన 'మెరుపు" చిత్రం బడ్జెట్ ప్రాబ్లమ్ తో ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఆగిపోలేదని, తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నఈ చిత్రం ఎప్పుడైనా ఆరంభమయ్యే అవకాశాలున్నాయని సూపర్ గుడ్ ఫిలింస్ అంటోంది. రామ్ చరణ్ తో ఈ సంస్థ 'రచ్చ" సినిమా ఆరంభించింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత 'మెరుపు" చేయాలనుకుంటున్నారట.
ఈ చిత్ర దర్శకుడు థరణి కూడా రామ్ చరణ్ టచ్ లో ఉంటున్నాడని, కథ మరింత పకడ్బందీగా చేస్తున్నాడని వినికిడి. బడ్జెట్, కథ అన్ని పక్కాగా కుదిరిన వెంటనే 'మెరుపు" ఆరంభించడానికి సూపర్ గుడ్ సంస్థ సిద్దంగా ఉందని సమాచారం. ఈ విషయాన్ని 'రచ్చ" ప్రారంభోత్సవంలో మాత్రం 'మెరుపు"ను రచ్చతర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ చెప్పుకురావడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది...