Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లైవ్లోకి మియా మాల్కోవా.. అనుభవాల గురించి మాట్లాడేందుకేనన్న వర్మ
రామ్ గోపాల్ వర్మ చర్యలు ఎవ్వరికీ అర్థం కావు. లాక్ డౌన్లో అందరూ సతమతమవుతుంటే ఆర్జీవి మాత్రం మియా మాల్కోవాను తీసుకొచ్చి సెగలు రేపుతున్నాడు. క్లైమాక్స్ పేరిట మియా మాల్కోవాలోని అందాలను తెలుగు ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. ఎన్ని కోణాల్లో చూపించాలో అన్నింట్లో మియా మాల్కోవాను చూపిస్తూ వేడి పుట్టిస్తున్నాడు. ఇక క్లైమాక్స్కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు. దానికి రేటు కూడా తాజాగా ప్రకటించాడు.
క్లైమాక్స్ చిత్రం విడుదలను ఎవ్వరూ ఆపలేరని చెబుతూ.. శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చిత్రాన్ని వీక్షించాలంటే ఒక్కసారి ఒక్కరికి వంద రూపాయలు చెల్లించాలని తెలిపాడు. ఇక ఈ సినిమా జూన్ 6న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే వరుస టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్తో నానా రచ్చ చేసిన ఆర్జీవీ.. తాజాగా మరో పోస్ట్ చేశాడు.
ఇంతవరకు వెండితెరపైన చూసిన మియా మాల్కోవాను మన తెలుగు ప్రేక్షకుల కోసం ఆమెను లైవ్లోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆర్జీవీ పోస్ట్ చేస్తూ.. మే 31న సాయంత్రం తొమ్మిది గంటలకు, అమెరికన్ టైమ్లో ఉదయం 8:30 గంటలకు ఆన్లైన్కు వస్తుంది.. క్లైమాక్స్ చిత్ర అనుభవాల గురించి చర్చిస్తామ'ని చెప్పుకొచ్చాడు. ఇక మరి ఈ లైవ్ వీడియో ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. క్లైమాక్స్ సినిమానే కాకుండా ఈ లాక్ డౌన్లో మరో చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. కరోనా వైరస్ పేరిట రిలీజ్ చేసిన ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అయింది.