Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
లైవ్లోకి మియా మాల్కోవా.. అనుభవాల గురించి మాట్లాడేందుకేనన్న వర్మ
రామ్ గోపాల్ వర్మ చర్యలు ఎవ్వరికీ అర్థం కావు. లాక్ డౌన్లో అందరూ సతమతమవుతుంటే ఆర్జీవి మాత్రం మియా మాల్కోవాను తీసుకొచ్చి సెగలు రేపుతున్నాడు. క్లైమాక్స్ పేరిట మియా మాల్కోవాలోని అందాలను తెలుగు ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. ఎన్ని కోణాల్లో చూపించాలో అన్నింట్లో మియా మాల్కోవాను చూపిస్తూ వేడి పుట్టిస్తున్నాడు. ఇక క్లైమాక్స్కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు. దానికి రేటు కూడా తాజాగా ప్రకటించాడు.
క్లైమాక్స్ చిత్రం విడుదలను ఎవ్వరూ ఆపలేరని చెబుతూ.. శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చిత్రాన్ని వీక్షించాలంటే ఒక్కసారి ఒక్కరికి వంద రూపాయలు చెల్లించాలని తెలిపాడు. ఇక ఈ సినిమా జూన్ 6న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే వరుస టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్తో నానా రచ్చ చేసిన ఆర్జీవీ.. తాజాగా మరో పోస్ట్ చేశాడు.
ఇంతవరకు వెండితెరపైన చూసిన మియా మాల్కోవాను మన తెలుగు ప్రేక్షకుల కోసం ఆమెను లైవ్లోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆర్జీవీ పోస్ట్ చేస్తూ.. మే 31న సాయంత్రం తొమ్మిది గంటలకు, అమెరికన్ టైమ్లో ఉదయం 8:30 గంటలకు ఆన్లైన్కు వస్తుంది.. క్లైమాక్స్ చిత్ర అనుభవాల గురించి చర్చిస్తామ'ని చెప్పుకొచ్చాడు. ఇక మరి ఈ లైవ్ వీడియో ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. క్లైమాక్స్ సినిమానే కాకుండా ఈ లాక్ డౌన్లో మరో చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. కరోనా వైరస్ పేరిట రిలీజ్ చేసిన ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అయింది.