Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మహేష్-వెంకీ కోసం కమిటైన మిక్కీ జే
మహేష్ బాబు-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో దిల్ రాజు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఖరారయ్యాడు. గతంలో హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం, అనగనగా ఒక ధీరుడు సినిమాలకు సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. రణగొణ ద్వనులు లేకుండా వినసొంపైన బాణీలు కట్టడంలో మిక్కీ జే మేయర్ మంచి నిపుణుడు. ఈ సినిమా కూడా క్లాసిక్ టచ్ తో కూడుకున్నది కావడంతో మిక్కేజేను సంగీత దర్శకుడిగా ఎపిక చేసినట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత రొమాన్స్ చేయడానికి కమిట్ అవ్వగా, వెంకటేష్ సరసన త్రిష జతకట్టబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ది బిజినెస్ మ్యాన్ సినిమా చేస్తున్నారు. వెంకటేష్ బాడీగార్డ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన అనంతరం అంటే...2012లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. మహేష్ బాబు-వెంకీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.