Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఆస్కార్కు తనికెళ్ల భరణి ‘మిథునం’ సిఫార్సు
ప్రముఖ రచయిత శ్రీ రమణ రాసిన 25 పేజీల "మిథనం" కధకు వెండితెరపై రూపాన్ని ఇచ్చి ఈనాటి సమాజంలో ఉన్న మన అందరిచేత ఆలోచింపచేసే ప్రయత్నం చేశారు తనికెళ్ళ భరణి. ఈ సినిమా చూస్తున్నంత సేపు రెండున్నర గంటలు ప్రేక్షకుడు నవ్వుతూనే ఉంటాడు. కాని ఆ నవ్వులో ఏదో తెలియని భారం, భాద. కాని ఈ రెండిటి మధ్య ఏదో ఒక తియ్యని అనుభూతి. అదే "మిథునం".
ఇక కధలోకి వెళ్ళితే చిన్న పిల్లవాడి మనస్తత్వం, భోజన ప్రియత్వం కలిగిన ఓ పెద్దాయన (యస్.పి.బాలసుబ్రహ్మణ్యం). ఆయన కోరింది వండి పెడుతూ అందులోనే ఆనందాన్ని వెతుక్కునే పెద్దావిడ (లక్ష్మీ). వీరిద్దరి కధే ఈ సినిమా. వీరికి పిల్లలు ఉన్నారు కాని పరాయి దేశంలో ఉంటారు. దానితో తమను పెంచిన నేలని, ఇంత వారిని చేసిన గాలిని, అగ్నిహోత్ర మంత పవిత్రమైన జీవితాన్ని, తమ దాంపత్య మధుర జ్ఞాపకాలని అనుక్షణం గుర్తుచేసే వారి ఇంటిని మరచిపోలేక, వదిలి వెళ్ళలేక నిస్సహాయులైన ఆ భార్య భర్తల జేవితమే ఈ సినిమా కధ.