Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ ‘మిర్చి’ ఆడియో రిలీజ్ వాయిదా
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'మిర్చి' ఆడియో విడుదల మరోసారి వాయిదా పడింది. గతంలో ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 23న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 5కు వాయిదా వేసారు.
హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఇదే వేదికపై 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నాయక్' చిత్రాలు ఆడియో ఫంక్షన్ జరుపుకుంది. దీంతో భారీ ఫ్యాన్ ఫోలోయింగ్ ఉన్న హీరోలంతా ఇదే వేదికపై తమ సినిమా ఫంక్షన్లు నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నారు.
సినిమా విశేషాల్లోకి వెళితే... సినిమా దాదాపుగా పూర్తయింది. ఇటీవలే ముఖ్య తారాగణంపై బ్యాంకాక్ లో పలు సీన్లు చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రభాస్ అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ లతో రొమాన్స్ చేస్తున్నాడు. కాగా... ఆడియో ఫంక్షన్ ఎంట్రీ పాసులు దక్కించుకునేందకు ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమాన సంఘాలు తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
ప్రభాస్ గత చిత్రం 'రెబల్' చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో ఇటు ప్రభాష్ తో పాటు అటు అభిమానులు కూడా మిర్చి చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.