twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాన ఫైట్ కలిపాక‘మిర్చి’వసూళ్లు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రభాస్ నటిస్తున్న 'మిర్చి' చిత్రంలో కొత్తగా ఒక రెయిన్ ఫైట్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ చూడటానికి అభిమానులు మళ్లీ థియేటర్ల బాట పడుతున్నారని నిర్మాతలు చెప్తున్నారు. ఈ విషయమై వారు మీడియా సమావేసం నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ''అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంది కాబట్టే 'మిర్చి' ఇంతటి విజయాన్ని సాధించింది. ఆరోవారంలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగాయి కూడా'' అన్నారు వి.వంశీకృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్.

    ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్‌లో కొరటాల శివను దర్శకునిగా పరిచయం చేస్తూ వంశీ, ప్రమోద్ నిర్మించిన 'మిర్చి' విజయపథంలో దూసుకెళుతోంది. ఇందులో ఇటీవల ఓ ఫైట్‌ని చేర్చారు. ఈ సందర్భంగా శనివారం ప్రమోద్, వంశీ మాట్లాడుతూ - ''వాన ఫైట్‌ను ముందు చిత్రీకరించినా, నిడివి ఎక్కువ అవుతుందన్న కారణంగా తీసేశాం. ఎంతో కష్టపడి తీసిన ఫైట్ అది. ఆ కష్టం వృధా అవ్వకూడదని ఇటీవల చేర్చాం. 'మిర్చి' విడుదలైనప్పుడు ఎంత స్పందన లభించిందో ఈ ఫైట్ యాడ్ చేసిన తర్వాత కూడా అంతే భారీ స్పందన వచ్చింది. వసూళ్లు కూడా పెరిగాయి.

    ఇప్పటివరకు ప్రభాస్ నటించిన చిత్రాలన్నిటిలోకల్లా ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రం ఇదే. వాన ఫైట్ చేర్చిన తర్వాత రెవిన్యూ డబులయ్యింది. ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం వసూళ్లు బాగున్నాయి. 'మిర్చి'లో ఇతర చిత్రాల షేడ్స్ ఉన్నాయనే టాక్ వచ్చినప్పటికీ, ప్రభాస్ డిఫరెంట్ లుక్, నటన, అనుష్క, రిచా గంగోపాధ్యాయ, విలన్లుగా చేసిన సంపత్, ఆదిత్య... ఇలా అందరి పాత్రలూ బాగుండటం, దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు, మది కెమెరా పనితనం, శివ టేకింగ్ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు'' అన్నారు.

    ఈ చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయాలనుకుంటున్నారా అనడిగితే - ''కొంతమంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. రీమేక్ గురించి తర్వాత ఆలోచిస్తాం. ఇటీవల విడుదలైన చిత్రాల్లో 50 రోజులు ఎక్కువ మెయిన్ సెంటర్స్‌లో ఆడిన చిత్రం ఇదే అవుతుంది. ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడంవల్ల ఈ మధ్య వంద రోజులు అరుదైంది. అయినప్పటికీ ఈ చిత్రం మెయిన్ సెంటర్స్‌లో వంద రోజులు పూర్తి చేసుకుంటుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

    English summary
    Prabhas latest film ‘Mirchi’ has added attraction now. A rain fight between Prabhas and villain gang, which was removed by the editing section earlier, has been added to the film now. Although, the director and producers of the film want the fight in the film, they have obliged the editor’s decision and released the film without the fight. But, after enjoying the success of their movie they have decided to add the rain fight scene as a pleasant gift to their audiences, who made the film super hit. They said they have spent enormous amount on the sets to shoot this rain fight, which they thought would be highlight of their film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X