Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ ‘మిర్చి’ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా...కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'మిర్చి' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్లో ప్రభాస్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో భారీగా రీలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అనుష్క, రిచా గంగోపాధ్యాయ నాయికలుగా, 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రానికి సంభాషణలు అందించిన కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ...ప్రభాస్ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. కథ మీద కమాండ్తో దర్శకుడు కొరటాల శివ ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటుందని ఆశిస్తున్నామ'ని తెలిపారు.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.