twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ‘మిర్చి’ ఘాటు లక్ష ఆటోలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'మిర్చి' చిత్రం ఈ నెల 8న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ప్రతి వ్యక్తికి 'మిర్చి' ప్రచార పోస్టర్లు చేరువయ్యేలా ప్లాన్ చేసారు. ఈ మేరకు హైదరాబాద్ వ్యక్తంగా లక్ష ఆటోలపై మిర్చి పోస్టర్లు అంటించాలని నిర్ణయించినట్లు సమాచారం.

    ఈ లెక్క ప్రకారం హైదరాబాద్ లోని సగం కంటె ఎక్కువ ఆటోలపై మిర్చి పోస్టర్లు దర్శనం ఇవ్వనున్నాయి. ఇందుకోసం నిర్మాతలు భారీగానే ఖర్చ చేసినట్లు తెలుస్తోంది. టీవీలు, పేపర్లలో యాడ్లతో పోలిస్తే ఆటో యాడ్స్ వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం జరుగుతుందని అంటున్నారు.

    కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

    సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Prabhas's upcomming film Mirchi gets variety publicity with Auto Rickshaw ads. Film Nagar source said that unit has arranged over 1 lakh stickers for Hyderabad Auto Rickshaw.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X