Don't Miss!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ట్రైలర్ అదిరింది: అనిల్ కపూర్ వారసుడు ఇతడే...!
హైదరాబాద్: బాలీవుడ్లో మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వారసత్వంతో ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగక పోయినా సోనమ్ కపూర్ ఇపుడు వరుస అవకాశాలతో దూసుకెలుతోంది.
తాజాగా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్దన్ కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సోనమ్ తమ్ముడైన హర్షవర్దన్ వయసు 25. 'మీర్జ్యా' అనే సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది.
పంజాబీ వీరుడు మీర్జా సాహిబన్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రంగ్ దే బసంతి, ఢిల్లీ 6, భాగ్ మిల్ఖా భాగ్ లాంటి చిత్రాలక దర్శకత్వం వహించిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగులో రేయ్ చిత్రంలో నటించిన సయామీ ఖేర్ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సినిమాలకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాకుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ రిలీజైన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రంలో ఓంపురి, ఆర్ట్ మాలిక్, కెకె రైనా, అనుజ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భాగ్ మిల్ఖా భాగ్ చిత్రానికి సంగీతం అందించిన సంగీత త్రయం శంకర్, ఎస్సాన్, లాయ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 7న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాకేష్ ఓం ప్రకాస్ మెహ్రా సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో 'మీర్జ్యా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.