Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నాగార్జునపై నెగిటివ్ గా మిస్ ఇండియా ట్వీట్
మిస్ ఇండియా వాసుకి రీసెంట్ గా నాగార్జున తాజా చిత్రం రాజన్నని చూసింది. ఈ సినిమాపై కొన్ని కామెంట్స్ ని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసి సంచలనం రేపింది. తాను రాజన్న చిత్రం చూసానని,అయితే క్రిటిక్స్ ఎలా ఈ చిత్రానికి నాలుగు స్టార్స్ రేటింగ్ ఇచ్చారో అర్దం కావటం లేదని అంది. ఇక ఇలాంటి రేటింగ్ ని తాను డాన్ 2 కు కూడా చూడలేదందంటూ కాస్త ఘాటుగానే ట్వీట్ చేసింది. అయితే ఇది నాగార్జున ఫ్యాన్స్ కి చాలా కోపం తెప్పించింది. వారు రిప్లైగా ఆమెకు కొన్ని కామెంట్స్ చేసారు.
అయితే ఇవన్నీ చూసిన ఆమె ..ఎందుకిలా రిడిక్యులస్ గా మాట్లాడుతున్నారో అర్దం కావటం లేదు...ఇది నా ఒపీనియన్ మాత్రమే. ట్విట్టర్ లాంటి మైక్రో బ్లాగింగ్ సైట్ల ద్వారా నా అభిప్రాయం ఎవరితో అయినా పంచుకునే స్వేచ్చ ఉందని ఎందుకు అర్దం చేసుకోరు..ఇది నా మైక్లో బ్లాగ్..ఇక్కడ నేను అభిప్రాయాలను పోస్ట్ చేసుకుంటాను అని స్పష్టంగా చెప్పింది. ఇక నాగార్జున హీరోగా విజియేంద్రప్రసాద్ డైరక్ట్ చేసిన చిత్రం రాజన్న. రాజమౌళి..యాక్షన్ సీక్వెన్స్ లు డైరక్ట్ చేసిన ఈ చిత్రం తెలంగాణా సాయిధ పోరాట యోధుని కధను చెప్తుంది. కీరవాణి పాటలు హైలెట్ గా రూపొందిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా సినిమా మాత్రం ఆర్దికంగా కలిసిరాలేదు.