శవంగా తేలిన సినీ నటి.. రెండు ముక్కలుగా రోడ్డు పక్కన?
ఒక సినీ నటి కనిపించకుండా పోయింది. ఇంకేముందు సినీ సెలబ్రిటీ కనిపించకుండా పోతే పోలీసులు ఊరుకుంటారా? బెటాలియన్లను రంగంలోకి దించారు. కానీ ఊహించని విధంగా ఆమె మృతదేహం లభ్యం అయింది. ఏకంగా ఆమె మృతదేహం ఒక గొనె సంచిలో దొరికింది. అసలు ఆ నటి ఎవరు? ఆమెకు ఏమైంది? గోనెసంచిలో శవం ఎలా అయింది అనే వివరాలు తెసులుకుందాం.

గోనె సంచిలో
బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము ఒక రోజు క్రితం అదృశ్యమైంది. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని ఒక గొనె సంచిలో స్వాధీనం చేసుకున్నారు. రైమా ఇస్లాం షిము మృతదేహం ఢాకాలోని కెరానిగంజ్ బ్రిడ్జి దగ్గర గోనె సంచిలో లభ్యమైంది . పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, సోమవారం ఉదయం కడమ్తోలి ప్రాంతంలోని అలీపూర్ సమీపంలో రైమా ఇస్లాం షిము మృతదేహాన్ని కొందరు స్థానికులు కనుగొన్నారు. దీంతో ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు.

నటి శరీరంపై గాయాలు
రైమా ఇస్లాం షిము శరీరంపై పలు గాయాల గుర్తులు ఉన్నాయని, ఆదివారం ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని వంతెన సమీపంలో పడేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిట్ఫోర్ట్ ఆసుపత్రి మార్చురీకి తరలించి స్థానిక పోలీస్ స్టేషన్లో అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. నివేదికల ప్రకారం, హత్య కేసులో విచారణ కోసం నటి భర్త షఖావత్ అలీ నోబెల్ మరియు అతని డ్రైవర్ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

కనిపించడం లేదని ఫిర్యాదు
అయితే, రైమా ఇస్లాం షిము భర్త ఆదివారం కాలాబాగన్ పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసింది. 45 ఏళ్ల రైమా ఇస్లాం షిము 1998లో 'బర్తమాన్' చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిందని తెలియజేద్దాం. ఆమె ఇప్పటివరకు 25 సినిమాలు మరియు కొన్ని టీవీ షోలలో నటించింది. ఆమె బంగ్లాదేశ్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యురాలు కూడా. ఈ కేసులో నటి భర్త, అతని స్నేహితుడితో సహా 6 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం, నటి భర్త సఖావత్, అతని స్నేహితుడు మరియు డ్రైవర్ను మూడు రోజుల రిమాండ్కు తరలించినట్లు ఢాకా పోలీసులు విలేకరుల సమావేశంలో తెలిపారు.

రెండు ముక్కలుగా
ఇంట్లో గొడవల కారణంగా తన భార్య రైమాను హత్య చేసినట్లు ఆమె భర్త ఒప్పుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగిందని ఢాకా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మరుఫ్ హుస్సేన్ సర్దార్ తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని గ్రీన్ రోడ్ ప్రాంతంలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. మావాలో షూటింగ్ కోసం ఆదివారం ఉదయం షిము ఇంటి నుంచి బయలుదేరారు. అనంతరం పలుమార్లు ఫోన్లో సంప్రదించినా ఆమె ఆచూకీ లభించలేదు. తల్లి షూటింగ్లో బిజీగా ఉండొచ్చని పిల్లలు అనుకున్నారు. అయితే సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కలబాగన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైమా మృతదేహాన్ని హజ్రత్పూర్ వంతెన సమీపంలో రోడ్డు పక్కన రెండు ముక్కలుగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిడ్ఫోర్డ్ ఆస్పత్రికి తరలించారు.

భర్తపై ఫిర్యాదు
మృతదేహాన్ని స్వీకరించిన తర్వాత, షిమూ సోదరుడు షాహిదుల్ ఇస్లాం ఖోకాన్ ఆమె భర్త సఖావత్ అమీన్ నోబెల్పై కేసు పెట్టాడు. నటుడు జాయెద్ ఖాన్ కూడా ఖోకాన్తో పోలీస్ స్టేషన్కు చేరుకున్నట్లు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో సభ్యత్వం విషయంలో జాయెద్ ఖాన్తో షిమూకు కూడా వివాదం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే గత రెండేళ్లుగా తాను షిముతో ఫోన్లో మాట్లాడలేదని ఖాన్ ఆరోపణలను కొట్టిపారేశాడు. ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అని అన్నారు. షిము సుమారు 25 చిత్రాలలో నటించారు. 50కి పైగా నాటకాల్లో నటించారు. ఆమె చాలా ఏళ్లుగా ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్లో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తోంది. ఆమెకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications