Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'సింహాద్రి', 'బొమ్మరిల్లు' కలిపితే వచ్చిందే 'బృందావనం'
'బృందావనం' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'సింహాద్రి', 'బొమ్మరిల్లు' కలిపితే 'బృందావనం' అంటూ ఎన్టీఆర్ తాజాగా తెలుగులోని ఓ లీడింగ్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రం చేయటానకి కారణం చెబుతూ... స్వతహాగా నాకు 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారు లోకం' లాంటి సినిమాలంటే చాలా ఇష్టం. కానీ చేయలేను. ఎంత కొత్తదారిలో వెళ్దామనుకొన్నా నా ఇమేజ్ని మరచిపోకూడదు కదా! అదెప్పుడూ మెడ మీద కత్తిలా నా కర్తవ్యం గుర్తుచేస్తుంటుంది. ఆ రెండింటినీ కలుపుకోవాలి.అందుకే రెండూ కలసినట్లుండే 'బృందావనం' చేసానన్నారు.
ఇక తన క్యారెక్టర్ గురించి చెబుతూ..గోవిందుడు ఎంత అల్లరివాడో తెలిసిందే కదా! తెర మీద కూడా అలాగే ఉంటాడు. నా తరహా సన్నివేశాలు చాలానే ఉంటాయి. 'పట్నం నుంచి వచ్చాడు. లవర్ బోయ్లా కనిపిస్తున్నాడు అనుకోకండి. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల మాస్ అలానే ఉంది. వాడు బయటకు వచ్చాడో రచ్చ రచ్చే' అనే డైలాగుతోనే నా పాత్ర స్వభావం తెలిసిపోతుంది. నవరసభరితమైన కథ ఇది. దర్శకుడు వంశీ తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుంది. నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో ఇష్టంతో ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దారు.లుక్ మారుతుందని మీసాలు తగ్గించి... కాస్ట్యూమ్స్ తీరు కూడా మార్చాం అన్నారు. ఇక బృందావనం చిత్రం ఈ నెల 14 న విడుదల అవుతుంది.