Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వేలాది జనం మధ్య బాలయ్య కేక
రాజకీయ నేపథ్యంలో (కర్నూల్) వేలాది జనాల మధ్య బాలయ్యతో చేసిన ఓ పాట హైలైట్ అంటున్నారు ఎం.ఎల్.కుమార్చౌదరి.బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తికంబైన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 20న యూరప్ వెళుతున్న సందర్భంగా నిర్మాత ఎం.ఎల్.కుమార్చౌదరి మాట్లాడుతూ ''ప్రస్తుతం కర్నూలులో చిత్రీకరణ సాగుతోంది. ఈ షూటింగ్తో.. 2పాటలు, 4రోజుల టాకీ మినహా సినిమా పూర్తవుతుంది. బాలయ్య స్థాయికి తగ్గని రీతిలో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాం. హీరో 3 వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. పాత్రలు మారేప్పుడు..ఆశ్చర్యకర రీతిలో నటనా వ్యత్యాసం చూపిస్తున్నారు. దర్శకుడు మురళి మా సంస్థకు 3హిట్లు ఇచ్చారు. తన ప్రతిభ సహా కళ్యాణి మాలిక్ సంగీతం అలరిస్తుంది. రాజకీయ నేపథ్యంలో (కర్నూల్) వేలాది జనాల మధ్య బాలయ్యతో చేసిన ఓ పాట హైలైట్. యాక్షన్, సెంటిమెంట్, కుటుంబ డ్రామా, కామెడీ..ఇలా అన్ని అంశాలతో తెరకెక్కుతోంది"" అన్నారు.
మరో ప్రక్క దర్శకుడు పరుచూరి మురళి... “ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. ఈ సినిమాని కీర్తి కంబైన్స్ పతాకం పై ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ అధినాయకుడు శ్రీరామరాజ్యం విడుదల అయిన రెండు నెలల గ్యాప్ లోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది. అంటే శ్రీరామరాజ్యం రిలీజ్ కాకముందే అధినాయకుడు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు ముస్తాబు అవుతుంది. లక్ష్మీరాయ్, సలోని కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: కళ్యాణిమాలిక్, కెమెరా: జయ్.సి.కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.