Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
టక్కరి, యమదొంగ, మంత్రకే లాభాలు: కీరవాణి
ఇప్పటి వరకూ 27 ఆల్బమ్స్ తీసుకొస్తే మూడింటికే లాభాలొచ్చాయి. అవి... టక్కరి, యమదొంగ, మంత్ర చిత్రాలు అంటున్నారు కీరవాణి. ఆయన వేదం చిత్రానికి సంగీతం అందించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...ఆడియో మార్కెట్ గురించి మాట్లాడారు. అలాగేఆయన భార్య నిర్వహిస్తున్న వేల్ రికార్డ్స్ విషయం గురించి చెబుతూ...వరుసగా నష్టాలే వస్తుంటే ఎవరైనా ఆ వ్యాపారాన్ని ఆపేసుకొని వేరే వ్యాపారాన్ని చూసుకొంటారు. మరి గత పదేళ్లుగా ఆడియో మార్కెట్ బాగోలేదు అంటూనే ఉన్నారు. వ్యాపారం సాగుతూనే ఉంది. నా భార్య శ్రీవల్లి 'వేల్ రికార్డ్స్' పేరిట చేస్తున్నది పూర్తి వ్యాపార దృక్పథంతో కాదు. తపనతో. నేనేమీ ప్రత్యేకంగా సూచనలు, సలహాలూ ఇవ్వను అన్నారు. అలాగే ప్రేక్షకుల అభిరుచి గురించి చెబుతూ..శ్రోతల అభిరుచుల్లోనూ ఏమీ మార్పులేదు. కాకపోతే ఇప్పుడు కాస్త రిథమ్స్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మెలోడీకి అప్పుడూఇప్పుడూ ఒకేలాంటి ఆదరణ ఉంది అన్నారు.