Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అప్పట్లో పుస్తకాల పురుగు, ఇప్పుడేమో కరోనా పురుగు.. ఆర్జీవీపై కీరవాణి అదిరిపోయే సెటైర్
సంగీత దర్శకుడు కీరవాణిలో ఎంత హాస్య చతురత ఉందో అందరికీ తెలిసిందే. కరోనాపై కీరవాణి చేసిన పేరడీ సాంగ్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనాపై సినీ సంగీత దర్శకులు, పాటలు రచయితలు తమ కలానికి పదును పెట్టి ప్రజలకు అవగాహన కలిగించారు. రామ్ గోపాల్ వర్మ కూడా తన ప్రతిభనంతా రంగరించి కరోనాను చీల్చి చెండాడు.
మామూలుగానే ఆర్జీవీ ట్వీట్ ఎవ్వరికీ అర్థం కావు. ఇక కరోనా విజృంభిస్తుంటే.. వాటిపై వర్మ కూడా ట్వీట్ల దాడి చేయడం మొదలుపెట్టాడు. కరోనాపై సెలెబ్రిటీలంతా పాటలు విడుదల చేస్తుంటే.. వర్మ కూడా తన కలానికి పదును పెట్టాడు. కరోనా పురుగు అంటూ నానా రకాలుగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు. కరోనా పురుగు అంటూ కీరవాణి ఆర్జీవీపై సెటైర్ వేశాడు.
ఈ మేరకు కీరవాణి ట్వీట్ చేస్తూ వర్మ నాడు ఎలా ఉండేవాడో నేడు ఎలా ఉన్నాడో చెప్పుకుంటూ ఓ సెటైర్ వేశాడు. '1988లో రామ్ గోపాల్ వర్మ ఓ పుస్తకాల పురుగు అని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు కరోనా పురుగును విశ్లేషిస్తూ బిజీగా ఉన్నారు.. స్టీఫెన్ కింగ్ బుక్ను ఇంకా చదువుతూనే ఉన్నావా?' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్కు వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.
The @RGVzoomin I knew in 1988 was a Pusthakaala Purugu. Now he is busy analysing Corona purugu😉 Sir, are you still reading Stephen King ?
— mmkeeravaani (@mmkeeravaani) April 24, 2020