Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దేశం విడిచి వెళ్లాలంటూ...అద్నన్ సమీకి సమన్లు
అద్నాసమీ వీసా గడువు ముగిసినా ఇండియాలో ఉంటుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎస్ఎన్) అనుబంధ సంస్థ మహారాష్ట్ర నవ నిర్మాణ్ చిత్రపథ్ కర్మచారి సేన(ఎంఎన్సికెఎస్) అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆయన వీసా గడువు పొగించకూడదని కోరింది.
ఎంఎన్సికెఎస్ అధ్యక్షుడు అమేయ కోప్కర్ మాట్లాడుతూ...ఆయన వీసా గడువు పొడగించకూడదని అధికారులను కోరాం. భారత్ దేశం ఎంతో మంది ప్రతిభగల గాయకులను కలిగి ఉంది. పాకిస్థాన్ నుంచి వచ్చి ఓ సింగర్ ఇక్కడ పాటలు పాడాల్సిన అవసరం ఎంత మాత్రం ఇక్కడ లేదు అని తెలిపారు. కాగా....అద్నాన్ సమీ లాయర్ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా వారు పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని తెలిపారు.
అద్నాన్ సమీ గత 20 ఏళ్లుగా వీసాతో భారత్లో ఉంటున్నారని, అక్టోబర్ 6తో వీసా గడువు ముగిసినందున మళ్లీ వీసా పొడగింపుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీసా పొడగింపు ప్రాసెస్ తరచూ నార్మల్ గా జరిగేదే అని, దీనిపై కొంత మంది అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.
అద్నాన్ సమీ బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాల్లో పాటలు పాడారు. 100%లవ్, ఊసరవెల్లి, ఇష్క్, జులాయి, దేవుడు చేసిన మనుషులు, దేనికైనా రెడీ, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల్లో అద్నాన్ సమీ పాడిన పాటలకు మంచి స్పందన వచ్చింది.