Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హరికృష్ణ కడసారి చూపుకు నోచుకోలేకపోయిన మోహన్ బాబు.. కారణం ఇదే!
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సినీరాజకీయ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. బుధవారం ఉదయం హరికృష్ణ నెల్లూరుకు ప్రయాణిస్తుండగా నల్గొండలో ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం హరికృష్ణ అంతిమ యాత్ర కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా హరికృష్ణ మరణ వార్త విని సినీనటుడు మోహన్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ, మోహన్ బాబు కలసి శ్రీరాములయ్య చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాలని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ నిర్మించిన డ్రైవర్ రాముడు చిత్రంలో కూడా మోహన్ బాబు నటించారు. అప్పటినుంచే మా మధ్య బంధం ఏర్పడిందని మోహన్ బాబు తెలిపారు.
హరికృష్ణ తనకు తమ్ముడిలాంటివాడని అన్నారు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నందువలన హరికృష్ణ అంత్యక్రియలకు హాజరు కాలేకున్నానని మోహన్ బాబు సందేశం పంపారు. అమెరికాలో ఉండగానే హరికృష్ణ మరణించాడని తెలిసింది. నాశరీరం ఒక్కసారిగా కంపించిపోయింది. దిగ్బ్రాంతికి గురయ్యా అని అన్నారు.