Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హరికృష్ణ కడసారి చూపుకు నోచుకోలేకపోయిన మోహన్ బాబు.. కారణం ఇదే!
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సినీరాజకీయ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. బుధవారం ఉదయం హరికృష్ణ నెల్లూరుకు ప్రయాణిస్తుండగా నల్గొండలో ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం హరికృష్ణ అంతిమ యాత్ర కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా హరికృష్ణ మరణ వార్త విని సినీనటుడు మోహన్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ, మోహన్ బాబు కలసి శ్రీరాములయ్య చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాలని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ నిర్మించిన డ్రైవర్ రాముడు చిత్రంలో కూడా మోహన్ బాబు నటించారు. అప్పటినుంచే మా మధ్య బంధం ఏర్పడిందని మోహన్ బాబు తెలిపారు.
హరికృష్ణ తనకు తమ్ముడిలాంటివాడని అన్నారు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నందువలన హరికృష్ణ అంత్యక్రియలకు హాజరు కాలేకున్నానని మోహన్ బాబు సందేశం పంపారు. అమెరికాలో ఉండగానే హరికృష్ణ మరణించాడని తెలిసింది. నాశరీరం ఒక్కసారిగా కంపించిపోయింది. దిగ్బ్రాంతికి గురయ్యా అని అన్నారు.