Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
దేశంలో నంబర్-1 సీఎం కేసీఆర్ : మోహన్బాబు
హైదరాబాద్ : సీఎం ఆలోచనలు అన్నీ సక్రమంగా జరిగితే దేశంలో నంబర్-1 సీఎం కేసీఆర్ అవుతారని హీరో మోహన్బాబు కొనియాడారు. సినీనటి జయసుధ తనయుడు శ్రేయాన్ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న 'బస్తీ' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఇలా స్పందించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
తెలుగునాట సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ చిన్న కుమారుడు శ్రేయాన్ టాలీవుడ్లో ‘బస్తీ' చిత్రంతో ఆరంగేట్రం చేస్తున్నాడు.శ్రేయాన్, ప్రగతి జంటగా వజ్మన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వాసు మంతెన దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘బస్తీ'.
జయసుధ మాట్లాడుతూ...‘‘ నా కొడుకు శ్రేయాన్ మొదటిసారి హీరోగా నటిస్తున్న చిత్రం ‘బస్తీ', ఈ కథ చాలా సింపుల్గా ఉండాలనుకున్నాం. ఇదో చక్కటి ప్రేమకథ. హీరోయిన్ ప్రగతి కూడా బాగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
కేసీఆర్, దాసరి, మోహన్ బాబు ఏమన్నారు, ఆడియో పంక్షన్ పూర్తి వివరాలు, ఫొటోలతో
సీడీ ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీఆర్... ఆడియో సీడీని ఆవిష్కరించి మాట్లాడారు.
మోహన్ బాబు మాట్లాడుతూ....
తెలంగాణ పోరాటయోధుడు సీఎం కేసీఆర్ మొదటిసారి సినిమా ఆడియో ఫంక్షన్కు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి కేసీఆర్ సినిమా పరిశ్రమకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చునన్నారు .
దర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడుతూ....
సీఎం కేసీఆర్ నగరంలోని బస్తీలన్నీ బాగుచేస్తున్నారని, పాడైపోయిన సినిమా బస్తీని కూడా బాగుచేయాలన్నారు. చిన్న కళాకారులు, చిన్ననిర్మాతలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మా సినిమా బస్తీని బాగుచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ మాట్లాడుతూ...
త్వరలోనే సినీ దిగ్గజాలతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ సందర్భంగా పరిశ్రమ అభివృద్ధికి ఏమేం చేయాలో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. చలనచిత్ర జగత్తులోని పెద్దలంతా హాజరై తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
అమితాబ్ ని కలిసినప్పుడు
ఆ మధ్య ప్రముఖ నటుడు అమితాబ్ తనను కలిసినపుడు దేశంలోనే అత్యధిక చిత్రాలు మీ హైదరాబాద్లోనే నిర్మాణమవుతున్నాయని చెప్పారని తెలిపారు. దీన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
ఫిలింనగర్-2
అవసరమైతే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ఫిలింనగర్కు తోడుగా ఫిలింనగర్-2 ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమేనని కేసీఆర్ చెప్పారు.
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్
ఔత్సాహిక చలన చిత్ర కళాకారులు శిక్షణ కోసం ఎక్కడెక్కడికో వెళుతున్నారని, ఆ అవసరం లేకుండా ఇక్కడే వారిని తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందామని కేసీఆర్ అన్నారు.
మహామహులు ఉన్నారు
పరిశ్రమలో అనేక మంది మహామహులు ఉన్నారని, వారి ఆసక్తికి తగిన విధంగా స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు తదితర కార్యకలాపాలు చేపట్టాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం పాలన సర్దుబాటు చేసుకోవడంతోనే సరిపోయిందని . కేసీఆర్ చెప్పారు
టఫ్ జాబ్
కొత్త రాష్ట్రం. కొత్త సంసారం. సర్దుకోవాలి.. ప్రాతిపదిక లేదు. అన్నీ ఉండే రాష్ట్రం అయితే ఎంత ఆదాయం వస్తుంది? ఎంత పోతుంది? మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది? తెలుస్తుంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు చూసుకోవాలి. ప్రజల అవసరాలు చాలా ఉంటాయి. ఇది చాలా టఫ్ జాబ్. మొదటి సంవత్సరంలో ప్రజల సమస్యలను తీర్చేపనిలో నిమగ్నమై ఉన్నాం అని కేసీఆర్ చెప్పారు
కాలరెగురేసుకునేలా...
ప్రపంచంలోనే అద్భుతమైన పారిశ్రామిక విధానం తెలంగాణ రాష్ట్రంలో రూపొందించాం. మండు వేసవిలో కూడా విద్యుత్ సమస్యను అధిగమించాం. ఇపుడు కాలరెగరేసుకునే స్థాయికి వచ్చాం. ఇప్పుడు ఇతర రాష్టాలకు విద్యుత్ అందించేలా ముందుకుపోతున్నాం. దేశ విదేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే స్థితిలో ఉన్నామని కేసీఆర్ అన్నారు.
అదే సంకల్పం
ఈ సందర్భంలో సినీ పరిశ్రమను కూడా అభివృద్ధిపరుచుకోవాలనే సంకల్పంతో ఉన్నాం. ఈ దిశగా త్వరలోనే చలనచిత్ర పరిశ్రమను అద్భుతమైన పద్ధతిలో విస్తరింపజేసేందుకు వీలైనంత త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తాం అని కేసీఆర్ చెప్పారు.
ప్రభుత్వం సహకరిస్తుంది
ఒక్కప్పుడు అన్నపూర్ణ, పద్మాలయా, రామానాయుడు స్టూడియోలు ఊరికిబయట ఉండేవి. ఇప్పుడు నగరం విస్తరించింది. అవి కమర్షియల్ ప్రాంతాలుగా మారాయి. ఇపుడు అవసరాలు మారాయి. హైదరాబాద్ చుట్టూ స్టూడియోలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది.
గోరంతలు కొండంతలు చేసారు
హైదరాబాద్ ఫిలింనగర్ సొసైటీలో జరిగిన గోరంత విషయాలను కొండంత చేసి చూపించారు. ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులు గౌరవించబడతారో ఆ సమాజం సుభిక్షంగా ఉంటుంది. తెలంగాణ సమాజానికి కళాకారులను గౌరవించుకునే గొప్ప సంస్కారం ఉంది. హైదరాబాద్ త్వరలోనే గొప్ప నగరంగా ఏర్పడబోతున్నది.
ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు
తన అబ్బాయిని శిక్షణకోసం ముంబై పంపించానని జయసుధ చెప్పారు. ఇంతపెద్ద నగరం పెట్టుకుని మనం షూటింగ్, శిక్షణ కోసం ముంబయి, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు. మన దగ్గరనే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే సంస్థలను ఏర్పాటు చేసుకుందాం.
సమావేశమవుదాం...
సినీ పరిశ్రమ గురించి చర్చించేందుకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో సమావేశమై చర్చిద్దాం. ఒకటి కాకపోతే రెండుసార్లు సమావేశమై సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చిద్దాం. అందుకు పరిశ్రమలోని పెద్దలు సూచనలు, సలహాలు అందించాలి.
ఎల్లలు లేవు
సినిమా కళాకారులకు ఎల్లలు ఉండవు, వారిని అందరూ గుర్తిస్తారు. సినిమాకు, సంగీతానికి రాష్ర్టాలతో, ఎల్లలతో సంబంధం లేదు. లతామంగేష్కర్ పాటలకు ఎల్లలు ఉండవు. 70 ఏండ్లు దాటిన అమితాబ్ను చిన్నపిల్లవాడు కూడా గుర్తు పడ్తరు, అది కళాకారుల గొప్పతనం. హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై అవసరమైతే చిరంజీవితో కూడా చర్చిస్తాను. ఇక ఫిలిం సొసైటీలలో కేవలం కళాకారులకే కాకుండా అందరికీ అవకాశం ఇద్దాం.
రూపాయికి గజం చొప్పున
సినిమా షూటింగ్లో పనిచేసే లైట్మెన్ దగ్గరనుంచి అందరు కార్మికులకు కూడా ఇండ్లను నిర్మించడంతోపాటు వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇక్కడ అవకాశాలు రానివారికి మరోచోట అవకాశం కల్పిద్దాం. పేద కార్మికులకు రూపాయికి గజం చొప్పున స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుందాం.
ఎన్ టీఆర్, శోభన్ బాబు వరకే...
నావరకు నేను ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్బాబు వరకే సినిమాలు చూశాను. ఆ తరువాత చూడలేదు. ఆ అవకాశం పోయింది. ఇప్పుడు మళ్లీ శ్రేయన్ సినిమాతోనే సినిమాలు చూడటం ఆరంభిస్తాను అని కేసీఆర్ అన్నారు.
భరోసా, హామీ
ప్రభుత్వం మొదటినుంచి చెప్తున్నట్టు నగరంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందనే భరోసాను ఇచ్చారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిసాం అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఎవరెవరు
ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసరి నారాయణ రావు, మోహన్బాబు, మురళీ మోహన్, టి.సుబ్బిరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, డి.సురేష్బాబు, విజయనిర్మల, ఎన్.శంకర్, జీవితా రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.