Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేను కోరుకున్నట్లే కేసీఆర్ గెలిచారు: మోహన్ బాబు
తాను కోరుకున్నట్లే తెలంగాణలో కేసీఆర్ గెలిచారని, టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం దక్కిందంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాట బయట పెట్టారు.
''ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కేసిఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.
ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కే సి ఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ
— Mohan Babu M (@themohanbabu) December 11, 2018
ఒక పార్టీ... అన్ని పార్టీలతో ఎంతో అందంగా ఫైట్ చేసింది. రాష్ట్రంలో అనేక అంశాలలో ఒక అందమైన మార్పును తీసుకొచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. వారికి నా అభినందనలు... అంటూ మోమన్ బాబు కూతురు మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.
మరో వైపు మంచే మనోజ్ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.