Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘రుద్రాక్షస్వామి’గా మోహన్బాబు
త్వరలో మోహన్ బాబు 'రుద్రాక్షస్వామి'గా కనిపించి అలరించనున్నారు. రచయిత జేకే భారవి దర్శకత్వంలో రూపొందుతోన్న 'జగద్గురు ఆదిశంకర'లో మోహన్ బాబు ఈ పాత్రలో కనిపిస్తారు. టైటిల్ రోల్లో కౌశిక్బాబు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై నారా జయశ్రీదేవి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే తెలుగు తెరపై హేమాహేమీలంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వారిలో ముఖ్యంగా నాగార్జున, శ్రీహరి, ప్రకాష్రాజ్, జయప్రద, రోజా, మీనా, పోసాని కృష్ణమురళి, విజయ్చందర్, కామ్నా జఠ్మలాని, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర కూడా కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -''ఈ తరానికి మన భారతీయ మూలాల విలువలు కచ్చితంగా తెలియాలి. అందుకే ఆదిశంకరుని జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నాం'' అని చెప్పారు. నారా జయశ్రీదేవి మాట్లాడుతూ -''95 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే మోహన్ బాబు, శ్రీరామచంద్ర, పోసాని, విజయ్చందర్, కామ్నా జఠ్మలాని, కన్నడ హీరో వాసు తదితరులపై కీలక ఘట్టాలను తీశాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. 18 మంది ప్రముఖ గాయనీ గాయకులు ఈ సినిమా కోసం పాటలు పాడారు'' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: పీకేహెచ్ దాస్, సంగీతం: నాగ్ శ్రీవత్స, పాటలు: ఆదిశంకరాచార్య, వేదవ్యాసు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్: ఉదయ్భాస్కర్.