Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'వైయస్' గా మోహన్ బాబు
ఆంధ్రపదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆయన మరణవార్త విని ఎందరో చలించిపోయారు. అలాంటి వారిలో వైఎస్ సన్నిహితుడు ప్రముఖ నటుడు మోహన్బాబు కూడా ఒకరు. వైఎస్తో తనకున్న అనుబంధాన్ని గురించి సోమవారం ఆయన మీడియాతో పంచుకున్నారు కూడా.
ఇదిలా ఉంటే వైఎస్ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ చిత్రాన్ని నిర్మించడానికి మోహన్బాబు సంకల్పించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు డా.దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తారని సమాచారం. అందుకు సంబంధించిన తర్జనబర్జనలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రకి రజనీకాంత్ని సంప్రదించినట్లు తెలిసింది. గతంలో మోహన్బాబు తండ్రిగా రజనీకాంత్ నటించిన 'పెదరాయుడు" చిత్రం ఎంతటి భారీ సక్సెస్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో కూడా రాజారెడ్డి పాత్రకు రజనీ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని ఆ పాత్రకు ఆయన్ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో స్నేహ కథానాయికగా ఎంపికయినట్లు సమాచారం. త్వరలోనే మిగిలిన తారలు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగనుందని తాజా సమాచారం.