మంగళవారం తిరుపతికి రావద్దు : మోహన్‌బాబు

By Srikanya

హైదరాబాద్ : ''ఇటీవలే నా తండ్రి మరణించారు. అందుకే మంగళవారం నా జన్మదిన కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం లేదు. తిరుపతి శ్రీవిద్యానికేతన్‌కే పరిమితమవుతాను. అయితే ప్రతి యేటా మార్చి 20, 21 తేదీల్లో నిర్వహించే విద్యానికేతన్‌ కార్యక్రమాలు యథాతథంగా సాగుతాయి''అంటున్నారు మోహన్ బాబు. మార్చి 19న తన జన్మదిన వేడుకలు జరపకుండా 20, 21 తేదీల్లో విద్యా సంస్థల వేడుకను మాత్రం యథాప్రకారం జరుపుతామనీ, ఈ వేడుకల్లో డ్రమ్స్ శివమణి, సంగీత దర్శకులు మణిశర్మ, చక్రి పాల్గొని ఆహూతుల్ని అలరిస్తారని ఆయన తెలిపారు.

"ఇటీవల మా నాన్నగారు పరమపదించిన సందర్భంగా ఈ సంవత్సరం మార్చి 19న నా జన్మదిన వేడుకను జరుపుకోవడం లేదు. ఆ రోజు తిరుపతికి సమీపంలో నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో ఉంటాను. అందుకని నా అభిమానులెవరూ తిరుపతికి రావద్దు. కావాలంటే ఫోన్లు చేసి శుభాకాంక్షలు అందజేయండి'' అని కోరారు సీనియర్ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్‌బాబు.

అలాగే తన తండ్రి పేరిట ఈ ఏడాది నుంచి ఎలిమెంటరీ పాఠశాల స్థాయిలో ఉత్తమ సేవలందించిన ఓ ఉపాధ్యాయునికి 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డుని అందజేస్తామని మోహన్‌బాబు ప్రకటించారు. అవార్డుతో పాటు కొంత నగదు బహుమతినీ ఇస్తామన్నారు. ''నా తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఉపాధ్యాయుడిగా ఎంతోమందికి విద్యాబుద్ధులు అందించారు.

తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి యేటా విద్యారంగంలో ఉత్తమశ్రేణి సేవలందించిన ఉపాధ్యాయుడికి పురస్కారం అందించాలని నిర్ణయించాను. ఈ యేడాది నుంచే ఆ పురస్కార ప్రదానం ఉంటుంద''న్నారు ప్రముఖ నటులు మోహన్‌బాబు. ఆయన ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X