Don't Miss!
- News Arvind Kejriwal అరెస్ట్ పై తగ్గని యూఎస్.. ఫ్రీజ్ చేసిన కాంగ్రెస్ ఖాతాలపైనా కీలకవ్యాఖ్యలు!!
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
మంగళవారం తిరుపతికి రావద్దు : మోహన్బాబు
"ఇటీవల మా నాన్నగారు పరమపదించిన సందర్భంగా ఈ సంవత్సరం మార్చి 19న నా జన్మదిన వేడుకను జరుపుకోవడం లేదు. ఆ రోజు తిరుపతికి సమీపంలో నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో ఉంటాను. అందుకని నా అభిమానులెవరూ తిరుపతికి రావద్దు. కావాలంటే ఫోన్లు చేసి శుభాకాంక్షలు అందజేయండి'' అని కోరారు సీనియర్ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్బాబు.
అలాగే తన తండ్రి పేరిట ఈ ఏడాది నుంచి ఎలిమెంటరీ పాఠశాల స్థాయిలో ఉత్తమ సేవలందించిన ఓ ఉపాధ్యాయునికి 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డుని అందజేస్తామని మోహన్బాబు ప్రకటించారు. అవార్డుతో పాటు కొంత నగదు బహుమతినీ ఇస్తామన్నారు. ''నా తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు ఉపాధ్యాయుడిగా ఎంతోమందికి విద్యాబుద్ధులు అందించారు.
తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి యేటా విద్యారంగంలో ఉత్తమశ్రేణి సేవలందించిన ఉపాధ్యాయుడికి పురస్కారం అందించాలని నిర్ణయించాను. ఈ యేడాది నుంచే ఆ పురస్కార ప్రదానం ఉంటుంద''న్నారు ప్రముఖ నటులు మోహన్బాబు. ఆయన ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.