Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మోహన్ బాబుకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది... ఇలా తిరిగిచ్చేస్తున్నాడు!
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీ విద్యానికేతన విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, పల
హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీ విద్యానికేతన విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులకు సన్మానం చేసారు. వక్తలు మాట్లాడుతూ మోహన్ బాబు సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అతడు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
మోహన్ బాబు
మోహన్బాబు మాట్లాడుతూ.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందుకే వారు పెడదారిన పడుతున్నారని తెలిపారు. పిల్లలతో తల్లిదండ్రులు రోజూ మూడు నుంచి నాలుగు గంటలు గడపాలని అప్పుడే వారికి ప్రేమానురాగాలు అందుతాయన్నారు. మంచి బుద్దులు నేర్పి పిల్లలను సమాజానికి సమాజానికి ఉపయోగపడేలా తీర్చి దిద్దే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
కోటి రూపాయల నిధి
శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవోగా మంచు విష్ణు మాట్లాడుతూ...పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టాలనుకునే విద్యార్థుల కోసం మోహన్బాబు కోటిరూపాయల నిధిని ఏర్పాటు చేశారన్నారు.
సమాజం చాలా ఇచ్చింది
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ...‘సామాన్యుడిగా పుట్టిన మోహన్బాబును ఈ సమాజం పద్మశ్రీని చేసిందని, ఆయనకు ఎంతో ఇచ్చింది. సమాజం నుంచి తీసుకున్న దానిని ఉంతో కొంత ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశ్యంలో మోహన్బాబు విద్యాదానం చేస్తున్నారంటూ అభినందించారు.
వినాయక్
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ మోహన్బాబు సినిమాను ఎంత ఇష్టపడతారో విద్యానికేతన్ని కూడా అం తే ఇష్టపడతారని తెలిపారు. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో ఆయన తనదైన ముద్ర వేసారని ఈ సందర్భంగా వినాయక్ చెప్పుకొచ్చారు.
లక్ష్మీ కటాక్షం
సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ శ్రీ విద్యానికేతన్లో చదువుకున్న వారికి సరస్వతితోపాటు లక్ష్మీకటాక్షం కూడా ఉంటుందన్నారు. మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పసంస్థ నడుస్తుండటం ఆనందంగా ఉందన్నారు.
క్రిష్
ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ కలను సాకారం చేసుకున్న మోహన్బాబును దగ్గరగా చూస్తుండటం ఆనందంగా ఉందన్నారు. సినీ పరిశ్రమలో ఆయన ఎందరికో ఆదర్శవంతుడని ఈ సందర్భంగా క్రిష్ కొనియాడారు.