Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మోహన్ బాబు 37వ పుట్టిన రోజు నేడు
సరిగ్గా 37 సంవత్సరాలు క్రిందట(1975 నవంబర్ 22న) మోహన్ బాబు జన్మించారు. ఇవాళ ఆయన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. అదేంటి మోహన్ బాబుకి ముప్పై ఏడేళ్లేనా అని ఆశ్చర్యపోకండి. భక్త వత్సల నాయుడుగా ఆయన ఎప్పుడో పుట్టి ఉండి ఉండవచ్చు. కానీ నటుడు మోహన్ బాబు గా జన్మించిన తేది మాత్రం ఈరోజే...అంటే 'స్వర్గం నరకం' (దాసరి నారాయణరావు దర్శకత్వం) చిత్రం విడుదలైన రోజు...ప్రపంచానికి మోహన్ బాబు పరిచయం అయన రోజు...ఈ రోజు.
మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలం నాయుడు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో మార్చి 19, 1952లో జన్మించిన మోహన్ బాబుకి క్రమశిక్షణ ... అంకితభావం అనేవి తండ్రి నుంచే అలవడ్డాయి . ఆ లక్షణాలే ఆయన్ని లక్ష్యం దిశగా కదిలేలా చేశాయి ... లక్షలాది హృదయాలకి చేరువచేశాయి. డిగ్రీ పూర్తి చేసిన మోహన్ బాబు, నటన పట్ల ఆసక్తితో మద్రాస్ చేరుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాగైనా ఎంటర్ కావాలనే ఉద్దేశంతో 50 రూపాయల జీతానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. ఏ మాత్రం చాలని ఆ జీతంతో ఇష్టంగా ఇబ్బందుల్ని అనుభవిస్తోన్న ఆయన్ని, అదృష్టమనేది దాసరి నారాయణరావు రూపంలో పలకరించిందిదాసరి దగ్గర అసెస్టెంట్ డైరక్టర్ గా చేరిన భక్తవత్సలం నాయుడు ఆ తర్వాత విలన్ గా 'శివరంజని', 'పదహారేళ్ల వయసు', 'సర్దార్ పాపారాయుడు', 'దేవత' వంటి చిత్రాలతో స్దిరపడ్డారు. విలన్ గా మంచి ఊపుమీద ఉన్నప్పుడు 'కేటుగాడు' తో సోలో హీరోగా మారి...'అల్లుడుగారు', 'అసెంబ్లీ రౌడి', 'అల్లరి మొగుడు', 'రౌడీగారి పెళ్లాం', 'బ్రహ్మ' వంటి చిత్రాలతో వరస హిట్స్ ఇచ్చారు.
ఆ తర్వాత వచ్చిన మెగా హిట్ 'పెదరాయుడు' (1995) ని చూడని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తో కలిసి 'మేజర్ చంద్రకాంత్', తర్వాత తరం మార్చి ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ తో యమదొంగ చేసినా వీసమెత్తుకూడా తగ్గని నటనా చాతుర్యం తగ్గలేదు. 35 సినీ ప్రయాణంలో 510 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఆయన శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ని పెట్టి రీసెంట్ గా 'ఝుమ్మంది నాందం' చిత్రం వరకు పలు చిత్రాలు నిర్మించి నిర్మాతగానూ శభాష్ అనిపించుకున్నారు. భారతీయ సినిమాకి ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో 'పద్మశ్రీ' బిరుదుతో ఈ అసమాన నటుడుని సత్కరించింది. తండ్రి బాటలోనే ఆయన తనయులు విష్ణు, మనోజ్ హీరోలుగా ప్రయాణం ప్రారంభించారు. అలాగే కుమార్తె లక్ష్మీప్రసన్నకూడా నటిగా, నిర్మాతగా దూసుకెలుతోంది.
నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల అధినేతగా, తండ్రిగా అన్ని విధాలా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్న మోహన్ బాబు..నేటికీ మంచి పాత్ర అనేది వస్తే రెడీ అంటూ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఈ నట ప్రపూర్ణుడు మరిన్ని ఇలాంటి నటనా పుట్టిన రోజులు జరుపుకోవాలని వన్ ఇండియా డాట్ కామ్ మనస్పూర్తిగా ఆశిస్తోంది...పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.