twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరుపై విరుచుకుపడ్డ మోహన్ బాబు

    By Staff
    |

    Mohan Babu
    చిరంజీవికి వ్యతిరేకంగా ఏదో ఒక పార్టీ ప్రచారంలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేస్తారని భావించి అంచనాలు వేసుకున్నవారిని మోహన్ బాబు నిరాశపరిచాడు. అయితే ఎలక్షన్స్ అనంతరం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ చిరుపై విమర్శనాస్త్రాలు వేసి మళ్ళీ అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజారాజ్యం పార్టీ ఈ ఎలక్షన్లో 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని తెలిసిందని..అయితే అంత సొమ్ము ఎక్కడ నుంచి తెచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే చిరంజీవి దాదాపు డబ్బై కోట్లు మాత్రమే ఆస్తిగా చూపారు. అంతేగాక ఎన్నారైల నుంచి కలెక్టు చేసిన పార్టీ ఫండ్ కేవలం అరవై రెండు కోట్లు అని చెప్పారు.

    ఇవన్నీ చెపుతూ..ఎలక్షన్లో ఎక్కడ నుంచి డబ్బు తెచ్చి చిరంజీవి ఖర్చు పెట్టారని ఆయన ప్రశ్నించారు. అదంతా బ్లాక్ మనీ అని విమర్శించారు. అంతేగాక రాష్ట్రలో హంగ్ వస్తుందని హెచ్చరిక చేసారు. ఇక ఈ విమర్శలు ఎలక్షన్ టైమ్ లో వేసుంటే పార్టీలు వారు ఆనందించే వారని, ఇప్పుడు ఇలా అనటం వల్ల కలిసివచ్చేదేముందని అంతా అంటున్నారు. ఇక చిరంజీవిని విమర్శిస్తూ తీసిన మేస్త్రి సినిమాలో మోహన్ బాబు ఓ దళిత నాయుకుడు పాత్రలో కన్పించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న చిత్రం రాజు-మహారాజు చిత్రంలో ఓ కీలకమైన పాత్రను చేస్తున్నారు. అలాగే తన కొడుకు విష్ణు వర్ధన్ హీరోగా చేస్తున్న సలీంలోనూ, మనోజ్ చిత్రంలోనూ విలక్షణమైన పాత్రలు చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X