దేవుడి చేతుల్లోనే: సినిమా చూసి మోహన్ బాబు వ్యాఖ్య
తిరుపతి: మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెద' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు తిరుపతిలో ఆయన విద్యార్థులతో కలిసి ఈ చిత్రాన్ని చూసారు. సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే 30 కోట్లు ఖర్చు పెట్టి తీసామని, ఆపై జయాపజయాలు దేవుడి చేతుల్లోనే అంటూ వ్యాఖ్యానించారు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్, అందరికీ నచ్చుతుందని వ్యాఖ్యానించారు.
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహించారు.
ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.
ఈ చిత్రాన్ని థియేటర్ రిలీజ్తో పాటు ఆన్ లైన్లోనూ విడుదల చేసారు నిర్మాతలు. అయితే ప్రస్తుతానికి యూరఫ్, దక్షిణాఫ్రికా దేశాల్లో zingreel.com ద్వారా ఈ సినిమాను చూడొచ్చు, త్వరలో వరల్డ్ వైడ్గా ఆన్లైన్లో సినిమా అందుబాటులోకి వస్తుందని మంచు విష్ణు తెలిపారు.


Click it and Unblock the Notifications












