Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ సినిమాకి ఆయనే హీరో ఆయనే విలన్: ద్విపాత్రాభినయంలో మోహన్ బాబు ?
మోహన్ బాబు "గాయత్రి" సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. ఇందులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అట.
Recommended Video
లెజెండరీ నటుడు మోహన్ బాబు కొన్నేళ్లుగా వేగం తగ్గించేశాడు. అప్పుడప్పుడూ మాత్రమే ఓ సినిమా చేస్తున్నాడు. చివరగా 'రౌడీ' అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు మోహన్ బాబు. ఆ తర్వాత మామ మంచు అల్లుడు కంచులో కీలకమైన పాత్రలో కనిపించాక మళ్ళీ తెరమీదకి రాలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమానే.. గాయత్రి. 'పెళ్లైన కొత్తలో' ఫేమ్ మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే 'మేడ మీద అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మోహన్ బాబుతోపాటు అతడి పెద్ద కుమారుడు మంచు విష్ణు ఓ ముఖ్య పాత్ర పోషించనున్నాడని కూడా ఒక న్యూస్. అలానే యాంకర్ అనసూయ జర్నలిస్ట్ పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. ఇందులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అట. హీరోగా.. విలన్ గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం క్యూరియాసిటీ పెంచే విషయమే.
ఇవి రెండూ నడి వయసు పాత్రలే అంటున్నారు. హీరోయిన్ నిఖిల ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుందట. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది. మోహన్ బాబు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ సినిమాను తీర్చిదిద్దాలని మంచు ఫ్యామిలీ భావిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందట.