Don't Miss!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ సినిమాకి ఆయనే హీరో ఆయనే విలన్: ద్విపాత్రాభినయంలో మోహన్ బాబు ?
మోహన్ బాబు "గాయత్రి" సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. ఇందులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అట.
Recommended Video
లెజెండరీ నటుడు మోహన్ బాబు కొన్నేళ్లుగా వేగం తగ్గించేశాడు. అప్పుడప్పుడూ మాత్రమే ఓ సినిమా చేస్తున్నాడు. చివరగా 'రౌడీ' అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు మోహన్ బాబు. ఆ తర్వాత మామ మంచు అల్లుడు కంచులో కీలకమైన పాత్రలో కనిపించాక మళ్ళీ తెరమీదకి రాలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమానే.. గాయత్రి. 'పెళ్లైన కొత్తలో' ఫేమ్ మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే 'మేడ మీద అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మోహన్ బాబుతోపాటు అతడి పెద్ద కుమారుడు మంచు విష్ణు ఓ ముఖ్య పాత్ర పోషించనున్నాడని కూడా ఒక న్యూస్. అలానే యాంకర్ అనసూయ జర్నలిస్ట్ పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. ఇందులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అట. హీరోగా.. విలన్ గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం క్యూరియాసిటీ పెంచే విషయమే.
ఇవి రెండూ నడి వయసు పాత్రలే అంటున్నారు. హీరోయిన్ నిఖిల ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుందట. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది. మోహన్ బాబు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ సినిమాను తీర్చిదిద్దాలని మంచు ఫ్యామిలీ భావిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందట.