Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు వారి తరువాత మంచు వారి వంతు.. మహానటి టీంకు సత్కారం!
ఇటీవల మహానటి చిత్ర యూనిట్ అల్లు అరవింద్ నుంచి ఘనమైన సత్కారాన్ని పొందింది. మహానటి చిత్రం విడుదలై మంచి వసూళ్లు సాధిస్తూ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ చిత్రం అలరిస్తోంది. లెజెండరీ నటి సావిత్రిగారి జీవితాన్ని ఎలా చూపించారు అనే ఆసక్తి సగటు ప్రేక్షకుడిలో నెలకొని ఉంది.
అల్లు అరవింద్ ఓ పార్టీ నిర్వహించి మరీ మహానటి చిత్ర యూనిట్ ని సత్కరించారు. ఈ పార్టీకి దర్శక ధీరుడు రాజమౌళి, అల్లు అర్జున్, హరీష్ శంకర్ వంటి వారు హాజరయ్యారు. ఇప్పుడు మంచి వారి వంతు వచ్చింది. మోహన్ బాబు మహానటి చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన తరువాత చిత్ర యూనిట్ ని సత్కరించారు. దర్శకుడు నాగ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్ హాజరయ్యారు. మంచు విష్ణు కూడా అక్కడే ఉన్నారు.
మోహన్ బాబు ఈ చిత్రంలో కామియో రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఆయన దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మెరిశారు. మహానటి చిత్రానికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నాగ అశ్విన్ దర్శకత్వ ప్రతిభకు అంతా నీరాజనాలు పడుతున్నారు.