Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు వారి తరువాత మంచు వారి వంతు.. మహానటి టీంకు సత్కారం!
ఇటీవల మహానటి చిత్ర యూనిట్ అల్లు అరవింద్ నుంచి ఘనమైన సత్కారాన్ని పొందింది. మహానటి చిత్రం విడుదలై మంచి వసూళ్లు సాధిస్తూ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ చిత్రం అలరిస్తోంది. లెజెండరీ నటి సావిత్రిగారి జీవితాన్ని ఎలా చూపించారు అనే ఆసక్తి సగటు ప్రేక్షకుడిలో నెలకొని ఉంది.
అల్లు అరవింద్ ఓ పార్టీ నిర్వహించి మరీ మహానటి చిత్ర యూనిట్ ని సత్కరించారు. ఈ పార్టీకి దర్శక ధీరుడు రాజమౌళి, అల్లు అర్జున్, హరీష్ శంకర్ వంటి వారు హాజరయ్యారు. ఇప్పుడు మంచి వారి వంతు వచ్చింది. మోహన్ బాబు మహానటి చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన తరువాత చిత్ర యూనిట్ ని సత్కరించారు. దర్శకుడు నాగ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్ హాజరయ్యారు. మంచు విష్ణు కూడా అక్కడే ఉన్నారు.
మోహన్ బాబు ఈ చిత్రంలో కామియో రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఆయన దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మెరిశారు. మహానటి చిత్రానికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నాగ అశ్విన్ దర్శకత్వ ప్రతిభకు అంతా నీరాజనాలు పడుతున్నారు.