Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
సింహం లాంటి కృష్ణగారు ఏడుస్తుంటే చూడలేకపోయా : మోహన్ బాబు
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు విజయ నిర్మల చివరి చూపు కోసం వారి నివాసాన్ని సందర్శిస్తున్నారు.
విజయ నిర్మల భౌతిక కాయాన్ని సందర్శించిన అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణగారు హీరోగా రూపొందుతున్న 'దీర్ఘ సుమంగళి' అనే సినిమాకు నేను అసోసియేట్ డైరెక్టర్గా పని చేస్తున్న రోజుల్లో విజయ నిర్మల గారు తీస్తున్న మరో సినిమాకు నూతన నటీనటులు కావాలని పిలిచారు. ఆ సమయంలో తారగ ఫస్ట్ టైమ్ మేకప్ టెస్ట్ జరిగింది. అందులో చంద్ర మోహన్ను హీరో. నేను విలన్ పాత్ర కోసం వెళ్లాను. కానీ సెలక్ట్ కాలేదు.' అని తెలిపారు.
''నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదమ్మా అంటే... నెక్ట్స్ పిక్చర్లో ఇస్తాను భక్తా అన్నారు. ఆమె నన్ను ఎప్పుడు కనిపించినా భక్తా ఎలా ఉన్నావు అని పలకరించేవారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాకు తల్లి లాంటిది. నేను కృష్ణగారితోనే ఎక్కువ సినిమాలు విలన్గా, కమెడియన్గా చేశాను. ఊటీలో షూటింగ్ ఉన్నపుడు ఆవిడే బ్రహ్మాండమైన వంటలు వండేవారు. చాలా గొప్ప దర్శకురాలు. ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆమె దర్శకత్వంలో చాలా సినిమాలు చేసినట్లు మోహన్ బాబు తెలిపారు.
విజయ నిర్మలగారి మరణంతో కృష్ణగారు చాలా దిగులుపడిపోయారు. ఆయన ఏడుస్తూనే ఉన్నారు. ఆయన్ను అలా చూడటం నా వల్ల కాలేదు. కృష్ణగారని ఎప్పుడూ సింహంలా చూశాను. ఆవిడ పోయిన బాధను ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు మోహన్ బాబు వ్యాఖ్యానించారు.