Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మోహన్ బాబుకు ‘నట వాచస్పతి’ బిరుదు
మోహన్బాబు మాట్లాడుతూ నెల్లూరు అంటే తనకెంతో ప్రాణమంటూ ఇక్కడ తనకు జరిగిన సన్మానంపై ఆనందం వ్యక్తం చేశారు. 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డి అజాతశత్రువు అని, అన్ని రంగాలతో మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మాట్లాడుతూ తాను టీఎస్సార్ కళా పరిషత్తులో ప్రధాన భూమిక పోషించడం ఆనందాయకమన్నారు. నెల్లూరు జిల్లా శాఖ అయిదోదని, అన్ని జిల్లాల్లోనూ త్వరలో శాఖ ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే ఏ రంగంలోనైనా రాణించగల సత్తా, విజయం సాధించే నేర్పు ఉన్న ఆయన.. అజాతశత్రువు అని అక్కినేని అభినందించారు.
సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ కళలున్న చోటనే సిరి సంపదలు వెల్లివిరుస్తాయని చెప్పారు. తాను ఎన్ని రంగాల్లో రాణించినా.. కళలతో ప్రేమాభిమానాలు, ఆరాధన వదలబోనని సేవ ద్వారానే గుర్తింపు పొందాలనేది తన జీవితాశయమన్నారు. తన చిన్నప్పుడే బాబాయ్ దొడ్ల సుబ్బారెడ్డి నెల్లూరులో ఆసుపత్రికి స్థలం దానం చేశారని, అదే తన మనసులో చెరగని ముద్ర వేసిందని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా తన లలితకళా పరిషత్తు ద్వారా అన్ని జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడుతో పాటు, సినీరంగ ప్రముఖులు మురళీమోహన్, బ్రహ్మానందం, వాణిశ్రీ, జీవిత రాజశేఖర్, అలీ, తనికెళ్ల భరణి, శ్రద్దాదాస్, అర్చన, దీక్షాసేథ్,పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, కోడి రామకృష్ణ, మోహన్బాబు కుమార్తె, నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న తదితరులు హాజరయ్యారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, చింతామోహన్, హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీవేత్త మాడుగుల నాగఫణిశర్మ తదితరులు కూడా హాజరయ్యారు.