Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహానటి: ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు?
మహానటి మూవీలో మోహన్ బాబు నటించబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఆయన ఎస్వీ రంగారావు పాత్రలో నటించబోతున్నారట.
హైదరరాబాద్: ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో జూ ఎన్టీఆర్ నటించబోతున్నారంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్గా ఖరారు కాలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించబోతున్నారని, ఆయన లెజెండరీ తెలుగు యాక్టర్ ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించబోతున్నారని టాక్.
మొదట ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ ను అనుకున్నారని, అయితే మోహన్ బాబు కంటే ప్రకాష్ రాజ్ బెటరనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్వీ రంగారావు పాత్ర చేయడం అంటే ఏ నటుడికైనా గర్వకారణమే.
'మహానటి'లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మళయాలం హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రకు ఎంపికయ్యాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ కూతురు నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.