Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహానటి: ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు?
మహానటి మూవీలో మోహన్ బాబు నటించబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఆయన ఎస్వీ రంగారావు పాత్రలో నటించబోతున్నారట.
హైదరరాబాద్: ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో జూ ఎన్టీఆర్ నటించబోతున్నారంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్గా ఖరారు కాలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించబోతున్నారని, ఆయన లెజెండరీ తెలుగు యాక్టర్ ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించబోతున్నారని టాక్.
మొదట ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ ను అనుకున్నారని, అయితే మోహన్ బాబు కంటే ప్రకాష్ రాజ్ బెటరనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్వీ రంగారావు పాత్ర చేయడం అంటే ఏ నటుడికైనా గర్వకారణమే.
'మహానటి'లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మళయాలం హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రకు ఎంపికయ్యాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ కూతురు నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.