Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెదరాయుడికి రెండు దశాబ్దాలు: ఇక మోహన్ బాబు కన్నప్ప కథ
హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించిన నటించిన పెదరాయుడు చిత్రం రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు డా.మోహన్ బాబు నిర్మాతగా ‘కన్నప్ప కథ' చిత్రం రూపొందుతోంది. ఎనిమిది దశాబ్దాలను పూర్తి చేసుకున్న టాలీవుడ్ లో ఎన్నో మరపురాని చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి.
అటువంటి మేటి చిత్రాల్లో కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నిర్మిస్తూ, నటించిన చిత్రం పెదరాయుడు ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఆప్త మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించడం విశేషం. కుటుంబంలో బంధాలు, అనుంబంధాలు గురించి గొప్పగా చాటి చెప్పిన ఈ చిత్రంలో పెదరాయుడుగా మోహన్ బాబు నటన అద్వితీయం. ఈ చిత్రం ఇరవై వసంతాలను పూర్తి చేసుకుంది.
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా దశ, దిశను మార్చిన చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమాలోని ప్రతి డైలాగ్ ఇప్పటికీ, ఎప్పటీకీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి నిలిచిపోయాయి. పెదరాయుడుగా తెలుగు ప్రజలను అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారతదేశంలోని అన్నీ భాషల్లో ‘కన్నప్ప కథ'చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పరమశివుని మహాభక్తుడిగా పేరు పొందిన కన్నప్ప గురించి తెలియని తెలుగువాడుండడు. ఆయన భక్తికి తార్కాణమే శ్రీ కాళహస్తీశ్వరాలయం. శివుని పరమవీర భక్తునిగా పేరు పొందిన కన్నప్ప పాత్రలో యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు నటించనున్నారు. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ, హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని డా.మోహన్ బాబు తెలియజేశారు.