Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
విష్ణుతో సన్నిలియోన్... ఫైర్ అయిన మోహన్ బాబు
ఇండో-కెనిడియన్ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ని తమ తాజా చిత్రం దేనికైనా రెడీలో పెట్టాలని యూనిట్ మొత్తం నిర్ణయించుకుంది. ఆమెకు అడ్వాన్స్ సైతం ఇవ్వటానికి రెడి అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు మండిపడ్డారు. హీరోయిన్ అంటే అలాంటి అలోచనలు చేయవద్దని సీరియస్ అయ్యారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సన్నిలియోన్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకురావాలనే ఆలోచన ఈ విధంగా వెనకపడిందని సమాచారం. మొదటి హీరోయిన్ గా హన్సిక చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ సాగుతోంది. ఆద్యంతం వినోదభరితంగా నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను మలుస్తున్నారు. యువతరాన్ని ఆకట్టుకునే విధంగా హన్సిక పాత్ర ఉంటుంది. క్లైమాక్స్, రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. విష్ణు ఈ చిత్రం గురించి చెబుతూ ''రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించేలా ఉంటుందీ చిత్రం. ప్రతి పాత్ర కావల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఈ వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. నా కెరీర్లో ప్రత్యేకస్థానంలో నిలిచే సినిమా ఇది''అన్నారు. 'ఢీ' తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన కెరీర్లో నిలుస్తుందని విష్ణు తెలిపారు.
ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ... ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు. మంచి టైమింగ్తో కామెడీని పండించగలనని 'ఢీ' సినిమాతో నిరూపించారు విష్ణు. అలాగే కామెడీ సినిమాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డిది అందెవేసినచెయ్యి... వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజిలో ఎంటర్టన్ చేస్తుందో ఊహించుకోమంటున్నారు నిర్మాతలు.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్తేజ, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్ బాబు.