Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సొంత పార్టీ పెట్టాలనుకున్నది నిజమే..మోహన్ బాబు
పార్టీ పెట్టాలనుకున్న మాట నిజమే..అప్పట్లో ప్రకటించాను కూడా.. అంటూ తన మనస్సులో మాటను మీడియా ముందు బయిట పెట్టారు మోహన్ బాబు. ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ తో ఆదివారం రాత్రి మాట్లాడుతూ ఈ విషయాలను ప్రస్ధావించారు. ఆయన మాటల్లోనే..పార్టీ పెట్టాలనుకున్న మాట నిజమే..అప్పట్లో ప్రకటించాను కూడా. ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. ఎందుకులే అనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దామన్నా, అందుకు ఎందరు సహకరిస్తారన్న ఆలోచనే కలవరపెడుతోంది. మనుషులకు తృప్తి లేదు. రాజకీయాల్లో ఎంతో ప్రజాసేవ చేసిన అన్నగారినే ఓడించారు. అంతేనా లేక...చిరంజీవి పార్టీ ప్రయోగం విఫలమైందని వెనక్కు తగ్గారా? అని అడగగా నేను పేర్లు ప్రస్తావించను కానీ.. ఆ ఒక్కటే కాదు.. ఎన్నో పార్టీలున్నాయి. తెలంగాణ ఒక్కటే వెనుకబడిందంటారు. నేనొప్పుకోను. రాయలసీమలో ఒక్కపూట భోజనానికీ ఇబ్బందిపడే పరిస్థితులున్నాయి. ఎందరో ప్రభుత్వంలో ఉ న్నత స్థానాలను అలంకరించారు. కానీ..వారు సీమ కోసం ఏం చేశారంటే..ఎన్నో ప్రశ్నలు. నామటుకైతే సమైక్యాంధ్రే ఉండాలని కోరుకుంటాను. నాకూ సీమ ఉద్యమం చేయాలనుంది. అంటే.. ప్రత్యేక రాష్ట్రం కావాలని కాదు..అభివృద్ధి కోసమే అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఆయన విలన్ గా చేసిన సలీం చిత్రం త్వరలో విడుదల కానుంది. వైవియస్ చౌదరి దర్శకత్వంలో విష్ణు హీరోగా చేసిన ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై, రిలియన్స్ వారితో కలిపి నిర్మించారు. ఇలియానా హీరోయిన్.