Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చెప్పులు లేకుండా నడిచా, ఏమి చేయలేక.. నా బిడ్డలకు అది నేర్పలేదు.. మోహన్ బాబు!
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కొద్దీ సేపటి క్రితమే జరిగింది. ఈ కార్యక్రమంలో వైఫ్ ఆఫ్ రామ్ చిత్ర యూనిట్ తో పాటు మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. డెబ్యూ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన కుమార్తె మంచు లక్ష్మి, చిత్ర యూనిట్ ని అభినందిస్తూ మోహన్ బాబు ప్రసంగించారు.
Recommended Video
మంచు లక్ష్మిని నమ్మి
సెల్ఫ్ డబ్బా కొట్టడానికి మాట్లాడడంలేదని ఈ చిత్రంలో నటించిన తన కుమార్తెని తప్పకుండా అభినందించాలని మోహన్ బాబు అన్నారు. నా బిడ్డని నమ్మి అమెరికాలో ఉన్న నిర్మాత ఈ చిత్రానికి డబ్బు పెట్టారు, అందుకు తండ్రిగా గర్వపడుతున్నా అని మోహన్ బాబు అన్నారు.
నా బిడ్డలకు నేర్పలేదు
డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. ఏదోవిధంగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటే ఎలా అని మోహన్ బాబు అన్నారు. అది తన బిడ్డలకు నేర్పలేదు అని మోహన్ బాబు తెలిపారు.
చెప్పులు లేకుండా నడిచా
తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు విజయ్ కి అభినందనలు తెలియజేశారు. 1975 లో తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా కొత్తే అని మోహన్ బాబు అన్నారు. చెప్పులు లేకుండా నడిచా. ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ స్థాయికి వచ్చా అని మోహన్ బాబు అన్నారు.
నా అల్లుడిని అభినందిస్తా
నా కుమార్తె ఇలా మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది అంటే అందుకు ఆమెని అభినందించను. నా అల్లుడు ఆనంద్ ని అభినందిస్తా అని మోహన్ బాబు అన్నారు. భర్తకు చెప్పకుండా భార్య బయటకు వెళ్ళకూడదు. లక్ష్మి ఇలా నటిస్తోంది అంటే అందుకు తన అల్లుడిని అభినందించాలి అని మోహన్ బాబు అన్నారు.
ఏమీ చేయలేక
ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు చూసి కుంగిపోయానని మోహన్ బాబు అన్నారు. మా గురువు దాసరి నారాయణరావు గారు ఉండి ఉంటే బావుండేది అని రోజు ఆలోచించానని అన్నారు. ఏమి చేయలేక అమెరికాలో ఉండిపోయానని మోహన్ బాబు అన్నారు.