Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులతో ఒకే సినిమాలో...
హైదరాబాద్: మోహన్ బాబు, తన ఇద్దరు కుమారులతో కలిసి ఒకేసారి తెరపై కనిపించనున్నారు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. విష్ణు, మనోజ్ నిర్మాతలు. మోహన్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు, మనోజ్లతోపాటు వరుణ్సందేశ్, తనీష్లు హీరో పాత్రలు పోషించబోతున్నారు.
ఇక మోహన్ బాబు సరసన ...ప్రముఖ హిందీ నటి రవీనా టాండన్ కనిపించనుంది. ఆమెతోపాటు హన్సిక, ప్రణీత హీరోయిన్స్ . ఈ నెల 21న ప్రారంభం కానుందీ చిత్రం. నిర్మాతలు మాట్లాడుతూ ''మేమిద్దరం హీరోలుగా నిలదొక్కుకోవడానికి డాడీయే స్ఫూర్తి. ఆయన శ్రమ మమ్మల్ని నిలబెట్టింది. ఇప్పుడు డాడీ హీరోగా మేం సినిమాను నిర్మించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించబోతున్నామనే విషయం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆద్యంతం వినోదాన్ని పంచే కుటుంబ కథా చిత్రమిది'' అన్నారు.
అలాగే ఎన్నో ప్రత్యేకతలతో, ఇంతవరకూ తెలుగులో రానివిధంగా ఈ చిత్రం నిర్మాణం కాబోతోంది. ఇది ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్. మాకు సినీ జన్మను ప్రసాదించిన మా తండ్రి మోహన్బాబుతో మొదటిసారి మేం నిర్మిస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలనూ మించి ఉంటుంది. ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూరుస్తారు. రచన: గోపీ మోహన్, కోన వెంకట్, బీవీయస్ రవి, ఛాయాగ్రహణం: పళనికుమార్, సమర్పణ: అరియానా, వివియానా.