కొంతమందికి డబ్బుంటే చాలు మర్యాద లేకపోయినా పరవాలేదు...మరికొంత మందికి మర్యాద ఉంటే చాలనుకుంటారు...కానీ ఈ మధ్య మర్యాద లేకున్నా పరవాలేదు..డబ్బుంటే చాలు అనుకునేవాళ్లు కొంతమంది ఉన్నారు... సినీ నిర్మాతకు గౌరవం ఇచ్చి నిర్ణీత సమయానికి వస్తేనే మర్యాద...7అంటే 7గంటలు...9 అంటే 9 గంటలకే వస్తేనే మర్యాద...గౌరవమూను...అన్నారు మోహన్ బాబు. నీ సుఖమే నే కోరుకున్నా..సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరయిన మోహన్ బాబు ఎందుకోగానీ ఎమోషనల్ గా మట్లాడారు. సమయం, డబ్బు, మర్యాదలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పారు. నీ సుఖమే నే కోరుకున్నా సినిమాను గిరిబాబు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
Story first published: Sunday, May 17, 2026, 1:56 [IST]