Don't Miss!
- News ఏపీలో కూటమి కోసం ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చీటింగ్ కేసు: ప్రియుడితో కలిసి పరారైన సినీ నటి
బెంగుళూరు: మలయాళ హీరోయిన్ లీనా మరియాపాల్ వేల కోట్ల రూపాయలు చీటింగుకు పాల్పడిన కేసులో ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. లీనాతో పాటు అరెస్టయిన ఆమె ప్రియుడు బెయిల్పై విడుదలయ్యారు. మళ్లీ వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండటంతో పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు.
కర్ణాటక ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొన్ని పథకాల నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నటి లీనాతో పాటు, ఆమె ప్రియుడు చంద్ర శేఖర్ అనేక మంది నిరుద్యోగులను నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసారు. కొన్ని సంస్థలు కూడా వీరి వలలో చిక్కుకుని మోసపోయాయి.
కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కావడంతో పలు పరిశ్రమలు కూడా వీరితో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వీరు దాదాపు రూ. వెయ్యి కోట్ల మోసానకి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న వీరిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.
గతంలో తమ మోసం బయట పడ్డ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన లీనా మరియా పాల్, చంద్రశేఖర్లు గత సంవత్సరం ఢిల్లీలోని ఫతేపుర్బేరీలో దొరికిపోయారు. ఇపుడు మళ్లీ బెయిల్పై విడుదలైన తర్వాత కూడా పరారు కావడం చర్చనీయాంశం అయింది. ఈ సారి వారు దొరికితే కటకటాల పాలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.