Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా పాట నీనోట ‘మూగ మనసులు’ గుర్తుందా?
మూగ మనసులు" సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది 'నా పాట నీనోట పలకాల సిలకా". ప్రతి ఒక్కరి మనస్సులో మెదలుతుంది. కానీ ఇప్పటి జనరేషన్లో ఏ పాట ఎలా వుంటుందో, అర్థం పర్థం కానీ విధంగా వుంటున్నాయి. కానీ అప్పట్లో......
ఆదుర్త సుబ్బారావు దాదాపు అంతా బౌట్ డోర్ లో, గోదారి నేపథ్యంలో తీసిన 'మూగ మనసులు" 1964వ సంవత్సరంలో విడుదలై విజయం సాధించింది. తెలుగు సినిమా రంగానికి, ఈ చిత్రానికి తెరపై అక్కినేని, సావిత్రి, జమున, గుమ్మడి, తెర వెనుక ఆదుర్తి, ఆత్రేయ, ముళ్లపూడి, మహదేవన్, ఘంటసాల వచ్చారు, కానీ, అవేవీ సాధారణ ప్రేక్షకుడి మనసులోకి జొరబడలేకపోయాయి. సరళమైన కథా గమనంతో సాగిన 'మూగ మనసులు" చిత్రం మాస్ ప్రేక్షకుల్ని సైతం అలరించింది. ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం యోగ్యతా పత్రం లభించింది.
తెలుగులో విజయవంతమైన ఈ చిత్రాన్ని 'మిలన్" పేరుతో హిందీలో తీయగా అక్కడా విజయవంతమైంది. అయితే మహానటి సావిత్రి 'ప్రాప్తం" పేరుతో తీసిన తమిల చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. ఇదే కథను కొద్దిపాటి మార్పులతో తర్వాత కాలంలో యువచిత్ర పతాకంపై కె. మురారి 'జానకిరాముడుగా" నిర్మిస్తే ఘనవిజయం సాధించింది. అలా జానకిరాముడు ఘన విజయం సాధించిన నాటి 'మూగమనసులు" లోని కళాత్మక, సాంకేతిక విలువల్ని మాత్రం ఈ చిత్రం సాదించలేకపోయింది. ఆత్రేయ, కె.వి. మహదేవన్లు ఈ చిత్రానికి కూడా పని చేయడం గమనించదగ్గ అంశం.