Don't Miss!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మూకీ సినిమా చేయబోతున్న వెంకటేష్
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ త్వరలో మూకీ(మాటలు లేని) సినిమా చేయబోతున్నారు. ప్రయోగాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం గతంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'పుష్పక విమానం' తరహాలో ఉండనుంది. పిల్ల జమిందార్ ఫేం జి. అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
యంగ్ హీరోల జోరు పెరుగుతున్న నేపథ్యంలో ఫేడౌట్ స్టేజీలో ఉన్న వెంకటేష్ హీరోగా కెరీర్ ముగిసేలోగా వీలైనన్ని వైవిధ్యమైన సినిమాలు చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఈ సినిమా సెట్స్ మీదకు వస్తే తెలుగులో మూకీ సినిమా చేసిన తొలి హీరోగా వెంకటేష్ చరిత్రకెక్కనున్నారు.
ప్రస్తుతం వెంకటేష్ 'షాడో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 26న విడుదలకు సిద్ధం అవుతోంది. షాడో చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్లు స్క్రిప్టు అందిస్తున్నారు. సింగర్ గీతా మాధురి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఐటం సాంగుకులకు మంచి కిక్ ఇచ్చే వాయిస్తో పాటు, ఆకట్టుకునే రూపం ఆమె సొంతం. ఇప్పటి వరకు తెర వెనక పాటలు పాడటానికే పరిమితం అయిన గీతా మాధురి త్వరలో తెరపై ఐటం సాంగులో కనిపించబోతోంది. షాడో చిత్రంలోని నాటీగర్ల్స్ అనే సాంగులో గీతా మాధురి సింగర్గా కనిపించబోతోంది. ఆమె మైక్ పట్టుకుని పాట పాడుతుంటే హీరోయిన్ తాప్సీ హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.